అచ్చంపేట పట్టణంలో ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి,అదేవిధంగా ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు.
ఇటీవలే హైదరాబాద్ నుండి వచ్చిన లింగాల మండలం మగ్దూంపూర్ చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని, మగ్దూంపూర్ వ్యక్తికి చెందిన ఏడుగురు అచ్చంపేట ఇద్దరికీ చెందిన 23 మంది ప్రైమరీ కాంటాక్ట్స్ ను గుర్తించామని వారి శాంపిల్స్ను సేకరించి కరోనా పరీక్షలకు పంపించనున్నట్లు బుధవారం డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ ఒక ప్రకటనలో తెలిపారు.