32.2 C
Hyderabad
May 1, 2024 23: 37 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీ పద్మావతి అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు రేపు అంకురార్ప‌ణ‌

#Tiruchanur Padmavati Temple

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 11 నుండి 19వ తేదీ వరకు ఏకాంతంగా జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలకు న‌వంబ‌రు 10వ తేదీ మంగ‌ళ‌వారం  అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్ ల‌క్ష‌కుంకుమార్చ‌న నిర్వ‌హిస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల న‌డుమ పుణ్యా‌హ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, సేనాధిప‌తి ఉత్స‌వం, యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.

న‌వంబ‌రు 11న ధ్వ‌జారోహ‌ణం :

ఆలయంలో న‌వంబ‌రు 11న బుధ‌వారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.30 నుండి 9.47 గంటల నడుమ ధ‌నుర్ల‌గ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు చిన్నశేష వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

వాహనసేవల వివరాలు :

11-11-2020(బుధ‌వారం)      ధ్వజారోహణం – చిన్నశేషవాహనం

12-11-2020(గురువారం)     పెద్దశేషవాహనం – హంసవాహనం

13-11-2020(శుక్ర‌వారం)   ముత్యపుపందిరి వాహనం –  సింహవాహనం

14-11-2020(శ‌నివారం)        కల్పవృక్ష వాహనం – హనుమంతవాహనం

15-11-2020(ఆదివారం)          పల్లకీ ఉత్సవం – వ‌సంతోత్స‌వం, గజవాహనం

16-11-2020(సోమ‌వారం)     సర్వభూపాలవాహనం – స్వర్ణరథం(స‌ర్వ‌భూపాల వాహ‌నం), గరుడవాహనం

17-11-2020(మంగ‌ళ‌వారం)     సూర్యప్రభ వాహనం  – చంద్రప్రభ వాహనం

18-11-2020(బుధ‌వారం)        రథోత్సవం(స‌ర్వ‌భూపాల వాహ‌నం) – అశ్వ వాహనం

19-11-2020(గురువారం)      పంచమితీర్థం(వాహ‌న‌మండ‌పంలో)  – ధ్వజావరోహణం.

Related posts

పింఛన్లు,నిరుద్యోగ భృతి,డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వండి మహాప్రభో

Satyam NEWS

స్పెషల్: మేడారం జాతరకు ప్రత్యేక టూర్ బస్

Satyam NEWS

కేసీఆర్ పాలనలో తెలంగాణ దిగజారిపోయింది

Satyam NEWS

Leave a Comment