కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో నెల్లూరు జిల్లా కావలి లో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారు. ఇప్పటి వరకు కావలి నియోజక వర్గంలో 439 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
కరోనా కేసులు నివారించే క్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ఆర్.డి.ఓ, మున్సిపల్ కమిషనర్, డిఎస్పీ, డిప్యూటీ డిఎం&హెచ్ఓ అధికారులు కలసి సంపూర్ణ లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ లాక్ డౌన్ ప్రకారం ఉదయం గం 5 నుండి గం8 వరకు కూరగాయల దుకాణాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. 8వ తేదీ నుండి 16వ తేదీ ఆదివారం వరకు అన్ని దుకాణాల మూతపడుతున్నాయి.