28.2 C
Hyderabad
May 9, 2024 01: 25 AM
Slider విజయనగరం

సర్దార్ గౌతులచ్చన్న తోట‌ప‌ల్లి ప్యేకేజ్-1 ప‌నుల‌కు శంకుస్థాప‌న‌

#totapally

విజయనగరం జిల్లా స‌ర్దార్ గౌతు ల‌చ్చ‌న్న‌తోట‌ప‌ల్లి బ్యారేజ్ ప్రాజెక్టుకు సంబంధించి మిగిలి పోయిన ప‌నుల్లో ప్యాకేజ్-1కు, బొబ్బిలి మండ‌లం పిరిడి వ‌ద్ద రాష్ట్ర పుర‌పాల‌క శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఈ శ‌నివారం ఉదయం శంకుస్థాప‌న చేయునున్నారు. తోట‌ప‌ల్లి ప్రాజెక్టును పూర్తి చేసే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ఇటీవ‌లే సుమారు 120 కోట్ల‌ను విడుదల చేసింది. వీటితో రెండు ప్యాకేజీలుగా ప‌నుల‌ను చేప‌ట్ట‌నున్నారు. వీటిలో 59.58కోట్ల‌తో మొద‌టి ప్యాకేజీ ప‌నుల‌ను పార్వ‌తీపురం డివిజ‌న్ ప‌రిధిలో నిర్వ‌హిస్తారు. దీనిలో భాగంగా కుడి ప్ర‌ధాన కాలువ‌ను 0 కిలోమీట‌ర్లు నుంచి 48.88 కిలోమీట‌ర్లు వ‌ర‌కు లైనింగ్ ప‌నులు, కాంక్రీట్ ప‌నులు పూర్తి చేస్తారు. మ‌ట్టిక‌ట్ట‌, స్పిల్‌వే క్రింద‌నున్న వ‌ర‌ద‌గ‌ట్టు ప‌నుల‌ను పూర్తి చేస్తారు. వీటితోపాటుగా విద్యుత్ సౌక‌ర్యం, వాచ్‌మెన్ క్వార్ట‌ర్స్‌, ఫుట్ బ్రిడ్జిలు, మొక్క‌ల పెంప‌కం త‌దిత‌ర ప‌నుల‌ను నిర్వ‌హిస్తారు. 9 డిస్ట్రీబ్యూట‌రీల‌తో 3  డైరెక్ట్ మ‌దుముల‌తో, డిస్ట్రీబ్యూట‌రీ నెట్‌వ‌ర్క్‌ను ఏర్పాటు చేస్తారు. వీటిలో భాగంగా మైన‌ర్‌, ఉప మైన‌ర్ ప‌నుల‌ను చేప‌డ‌తారు. మొత్తంగా ఈ ప్యాకేజీలో 7లక్షల,55వేల ,565 ఘ‌న‌పు మీట‌ర్ల మ‌ట్టిప‌ని, 42వేల 630 ఘ‌న‌పు మీట‌ర్ల కాంక్రీట్ ప‌నుల‌ను నిర్వ‌హిస్తారు. ఈ ప‌నుల ద్వారా సీతాన‌గ‌రం, బొబ్బిలి, బాడంగి, బ‌లిజిపేట‌, తెర్లాం, శ్రీ‌కాకుళం జిల్లా వంగ‌ర మండ‌లాల్లోని 12వేల,755.70 ఎక‌రాల‌ ప‌ల్లం భూముల‌కు, 7వేల 663.33 ఎక‌రాల మెట్టు భూముల‌కు, మొత్తంగా 20,521 ఎక‌రాల‌కు సాగునీరు అందనుంది.

Related posts

రిపబ్లిక్ టివి అర్నబ్ గోస్వామి బెయిల్ తిరస్కరణ

Satyam NEWS

సీఎం జగన్‍పై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ సీరియస్

Satyam NEWS

[Best] Ace Weight Loss Pills Results Weight Loss Pill Ad Supplements For Skin Elasticity After Weight Loss

Bhavani

Leave a Comment