29.7 C
Hyderabad
May 1, 2024 07: 19 AM
Slider కడప

సీఎం జగన్ న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా

#mydukuru

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించి న్యాయం చేయకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోక తప్పదని వైసీపీ నేత ఒకరు ఆవేదనతో హెచ్చరించారు. YSR కడప జిల్లా మైదుకూరు మండలం పప్పనపల్లె గ్రామ పంచాయతీ ఓబుళాపురం గ్రామం వైసీపీ నేత వెంకట్రామిరెడ్డి దీనగాథ ఇది. వైసీపీకి చెందిన కొందరు నేతలే కక్షకట్టి గ్రామంలో తన డీలర్ షిప్ ను రద్దు చేయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వై ఎస్ రాజశేఖరరెడ్డికి ఆ తర్వాత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి తన కుటుంబం మొత్తం ఓట్లు వేస్తూ వచ్చామని, అందుకు పరిహారంగా ఇలా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడితే చివరకు తనకు  అన్యాయం చేసారని ఆయన అన్నారు. తనలాగా వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరగకూడదని విజ్ఞప్తి చేశారు.

Related posts

వనపర్తి దేవాదాయ భూములను కాపాడండి

Sub Editor

సిఎంకు అండగా ఉందాం సాక్షిని నిలబెట్టుకుందాం

Satyam NEWS

నవంబర్ 18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Satyam NEWS

Leave a Comment