ములుగు జిల్లా వాజేడు మండలంలోని బీరమయ్య గుట్ట వద్ద శుక్రవారం మధ్యాహ్నం ట్రాక్టర్ బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అక్కడున్న స్థానికులు వారిని ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.