40.2 C
Hyderabad
April 29, 2024 15: 29 PM
Slider రంగారెడ్డి

బలిదాన్ దివస్ సందర్భంగా మొక్కలు నాటిన మహిళా మోర్చా

#BJMC Kukatpally

డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి(బలిదాన్ దివస్) సందర్భంగా గా కూకట్ పల్లి ముసాపేట డివిజన్ లోని శక్తి నగర్ లో మేడ్చల్ జిల్లా మహిళ మోర్చా విభాగంలో లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు కొత్తూరు గీత మూర్తి, రాష్ట్ర మహిళ  మోర్చా ఉపాధ్యక్షురాలు  నాగ పరిమళ, రాష్ట్ర మహిళ మోర్చా సెక్రటరీలు సులోచన, గీతారాణీ లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖండ భారత దేశ స్ఫూర్తిని గుండె గుండెలో రగిలించిన జాతీయవాది, నిరాడంబరతకు నిదర్శనంగా నిలిచిన జననేత, దేశభక్తి కి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని తెలిపారు.

భారతదేశంలో సంపూర్ణంగా విలీనమైన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 కి వ్యతిరేకంగా ఆయన ఉద్యమం చేశారన్నారు. కాశ్మీర్ కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని ఆయన వర్ధంతి సందర్భంగా గుర్తు చేశారు.

కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పిట్ల మనోహర్, మేడ్చల్ మహిళ మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి,మేడ్చల్  అర్బన్ జిల్లా ఉపధ్యక్షురాలు గంటమనేని  స్రవంతి , మహిళా నాయకురాళ్లు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ఉన్నతాధికారుల వత్తిడితో ఉద్యోగానికి స్వస్తి

Satyam NEWS

దిశ యాప్ డౌన్ లోడ్ పై విజయనగరం ఎస్పీ యాక్షన్ ప్లాన్…!

Satyam NEWS

మళ్లీ కరోనా

Murali Krishna

Leave a Comment