32.7 C
Hyderabad
April 27, 2024 00: 11 AM
Slider ముఖ్యంశాలు

మళ్లీ కరోనా

#corona

దేశంలో గత కొన్నిరోజులుగా కొవిడ్‌-19తోపాటు ఇన్‌ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. 140 రోజుల తర్వాత మళ్లీ ఇపుడు అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క లోనే  దేశంలో 1,300 కొవిడ్‌ కేసులను గుర్తించారు. ముందురోజుతో పోలిస్తే 166 కేసులు పెరిగాయి. ఈ మహమ్మారి వల్ల తాజాగా కర్ణాటక, గుజరాత్‌, మహారాష్ట్రల్లో ముగ్గురు ప్రాణాలు విడిచారు.  ఒక్కరోజే 718 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. యాక్టివ్‌ కేసులు 0.02 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో  గురువారం 7,530 మందికి కొవిడ్‌ టీకాలు అందించగా,  ఇప్పటివరకు పంపిణీచేసిన వ్యాక్సిన్‌ డోసుల సంఖ్య 220.65 కోట్లకు చేరింది. గురువారం ఒక్కరోజే 89,078 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య, మరణాల్లో ఎటువంటి పెరుగుదల నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు.

Related posts

గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై బాలికలకు అవగాహన

Satyam NEWS

మూసాపేట్ జిహెచ్ఎంసి సర్కిల్ ఆఫీస్ లో బతుకమ్మ సంబురాలు

Satyam NEWS

పేదల కడుపు కొడుతున్న తెలంగాణ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment