29.7 C
Hyderabad
April 29, 2024 08: 21 AM
Slider ఆదిలాబాద్

నెగ్లిజెన్స్: అకస్మాత్తుగా రాలిపోయిన గిరిజన బిడ్డ

nirmal tribal

గిరిజన బిడ్డలు రాలిపోతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో నేడు ఒక దారుణం జరిగింది. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సుర్దబాయి ఆకస్మికంగా మరణించింది. నిన్న రాత్రి అస్వస్థతకు గురైన సుర్దబాయి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఎందుకు మరణించిందో ఎవరికి తెలియదు.

ఆమె అస్వస్థతకు గురైన విషయం గానీ మరణించిన విషయంగానీ ఆమె కుటుంబానికి తెలియచేయకుండా అధికారులు అశ్రద్ధ వహించారు. విషయం తెలుసుకుని వచ్చిన ఆమె బంధువులు ఆందోళన చేశారు. జైనూరు మండల కేంద్రంలో రహదారిపై ఆందోళన చేపట్టి  బంధువులు తమ నిరసన తెలిపారు. కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ బంధువులు డిమాండ్ చేశారు. ఐటీడీఏ po రావాలని, వచ్చి తమకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

Related posts

ఆధార్ మార్పులు చేర్పులు ఇక గ్రామ సచివాలయాల్లోనే

Satyam NEWS

గజిటెడ్ అధికారుల డైరీ ఆవిష్కరించిన సిఎం కేసీఆర్

Satyam NEWS

తెలంగాణ పోరాటంలో కేసీఆర్ పాత్ర లేదు

Satyam NEWS

Leave a Comment