తెలంగాణ స్ఫూర్తి ప్రదాత, ఉద్యమ కెరటం ఆచార్య కొత్తపల్లి జయ శంకర్ సర్ అని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత్ కేశవ్, యస్. మోహన్ రావు అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జయశంకర్ సర్ జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అలుపెరుగని కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి జయశంకర్ సర్ అని ఆయన సేవలను ఈ సందర్బంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ అధికారులు జ్యోతి పద్మ, శంకర్, అనసూర్య ,శిరీష, దయానంద రాణి,సి.పి.ఓ జి. వెంకటేశ్వర్లు, ఏ. ఓ శ్రీదేవి అన్ని శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.