అరుణాచల్ ప్రదేశ్ లో ఆర్మీ చాపర్ కూలిన ఘటనలో లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి, మేజర్ జయంత్ లు మృతి పట్ల చర్లపల్లి డివిజన్ లోని రెడ్డి కాలనీ సంక్షేమ సంఘం నాయకులు శుక్రవారం నివాళులర్పించారు. చక్రిపురం చౌరస్తాలో వారి ఫోటోలకు పూలమాలవేసి నివాళులర్పించారు. కల్నల్ వీవీబీ రెడ్డి స్వస్థలం బొమ్మల రామారం కాగా ఆయన కుటుంబం మల్కాజిగిరిలో నివాసం ఉంటోంది. కల్నల్ భార్య ఆర్మీలో దంత వైద్యురాలిగా పనిచేస్తున్న విషయం విధితమే. ఈ కార్యక్రమంలో రెడ్డి కాలనీ మాజీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, అధ్యక్షులు రంగారెడ్డి ఉపాధ్యక్షులు సుదర్శన్, భూమి రెడ్డి కోశాధికారి తిరుపతి రెడ్డి, రవీందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, యాదిరెడ్డి, విజయ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా