పండగలా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
గురువారం నాడు నకిరేకల్ నియోజక వర్గం రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురం, సిరిపురం, ఇంద్రపాలనగరం గ్రామాలలో ఆయన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
గతంలో కంటే మెరుగ్గా సభ్యత్వ నమోదు నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రజలంతా టీఆరెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.
రోజురోజుకు ప్రజల్లో టీఆరెస్ పార్టీ పై మరింత విశ్వాసం ఏర్పడుతుందని అన్నారు. పార్టీలో చురుగ్గా ఉండే కార్యకర్తలు క్రియాశీల సభ్యత్వం పొందాలని ఆయన తెలిపారు.
ప్రతిపక్షాల అసత్య ఆరోపణలు గులాబీ సైనికులు తిప్పి కొట్టాలని సూచించారు.