సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో శనివారం టిఆర్ఎస్ కెవి అనుబంధ సంఘ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు పి ఆర్ సి 30 శాతం ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి నియోజకవర్గ కార్మిక సంఘ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్ అధ్యక్షతన క్షీరాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ యూనియన్ రాష్ట్ర నాయకుడు కృష్ణ, జిల్లా అధ్యక్షులు పూర్ణిమ, జిల్లా నాయకులు శ్రీనివాస్, రజిత, పాల ఈశ్వరి, సంగీత, వెంకన్న, లక్ష్మీపతి, శైలజ, రాధిక, వెంకటరమణ, రవికుమార్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.