28.7 C
Hyderabad
April 28, 2024 04: 50 AM
Slider ముఖ్యంశాలు

హాజరీ హో: అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టుకు నేడు జగన్

jagan 05

అక్రమాస్తుల కేసుకు సంబంధించి సిబిఐ కోర్టుకు నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. అందుకోసం ఉదయం 8 గంటల 50 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. బేగంపేట్ విమానాశ్రయంలో దిగి అక్కడ నుంచి పదిన్నర గంటలకు సిబిఐ కోర్టుకు చేరుకుంటారు. విచారణ పూర్తిచేసుకొని పదకొండున్నర గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి తిరుగు పయనమవుతారు.

సీబీఐ, ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలన్న జగన్ అభ్యర్థనను కోర్టు గతంలో తోసిపుచ్చింది. సీబీఐ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ… జగన్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై తెలంగాణ హైకోర్టులో ఈ నెల 12న విచారణ జరగనుంది. ముఖ్యమంత్రి అయ్యాక అక్రమాస్తుల కేసు విచారణకు జగన్ హాజరవుతుండటం ఇది రెండోసారి. సీబీఐ దాఖలు చేసిన 11 ఛార్జిషీట్లు, ఈడీ వేసిన 5 అభియోగపత్రాలపై విచారణకు హాజరుకానున్నారు.

Related posts

మే 31 వరకూ స్కూళ్లకు వేసవి సెలవులు

Satyam NEWS

దత్తాత్రేయను కలిసిన డిఐజి రంగనాధ్, కలెక్టర్ పాటిల్

Satyam NEWS

వైభవంగా అది శంకరాచార్యుల 1235 వ మహా జయంతి

Satyam NEWS

Leave a Comment