28.7 C
Hyderabad
May 6, 2024 10: 06 AM
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

ఔటర్ పై ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరి మృతి

tuni rtc

హైదరాబాద్ శివారు ప్రాంతమైన పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా తుని ఆర్టీసీ బస్ డిపోకు చెందిన బస్సు వేగంగా వస్తూ పెద్ద అంబర్ పేట్ వద్ద అటుగా వస్తున్న ఒక స్కూటర్ ను ఢీకొట్టింది. దాంతో స్కూటర్ పై వస్తున్న దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. కొహెడ గ్రామానికి చెందిన రమణారెడ్డి ఈ ప్రమాదంలో మరణించినట్లుగా గుర్తించారు. ప్రమాదం ఉదయం 6 గంటలకు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో అగ్రహోదగ్రులైన జనం అక్కడ రాస్తారోకో నిర్వహించారు. దాంతో ఔటర్ రింగు రోడ్డు వద్ద ట్రాఫిక్ పూర్తిగా స్తంభించి పోయింది. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి హయత్ నగర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఔటర్ రోడ్ ఎక్కేందుకు, దిగేందుకు వీలులేని పరిస్థితి ఉంది. జిల్లాల నుంచి వచ్చే వాహనాల్లోని ప్రయాణికుల తీవ్ర ఇబ్బంది పడ్డారు. అటోలు, బస్సులు, అన్నిరకాల వాహనాలు నిలిచి పోయాయి.

Related posts

మఠంపల్లి మండల కేంద్రంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు

Satyam NEWS

సురక్షితంగా మీ గమ్యస్థానాలకు చేరుకోవాలి

Bhavani

గాంధీ జయంతి నాటికి శత శాతం అక్షరాస్యత సాధిద్దాం

Satyam NEWS

Leave a Comment