38.2 C
Hyderabad
April 27, 2024 15: 40 PM
Slider నల్గొండ

ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు బాధ్యతతో వ్యవహరించాలి

#priyadarsini

విద్యార్థులు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో బాధ్యతతో వ్యవహరించాలని  ప్రియదర్శిని విద్యాసంస్థల కరస్పాండెంట్ పశ్య శ్రీనివాసరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రియదర్శిని జూనియర్,డిగ్రీ కళాశాల విద్యార్థులకు శనివారం ఫ్రెషర్స్ పార్టీని నిర్వహించారు.

ఈ సందర్భంగా పశ్యా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కరోన మహమ్మారి వలన విద్యార్థులకు సిలబస్, పరీక్షలలో, కొంత అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. వాటిని అధిగమించ వలసింది విద్యార్థులేనని అన్నారు. పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే విద్యార్ధులు వ్యక్తిగత లక్ష్యాలు ఏర్పరుచుకుని వాటి కోసం కృషి చేయాలని అన్నారు.అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.

ఈ కార్యక్రమంలో ప్రియదర్శిని డిగ్రీ జూనియర్ కళాశాలల ఇన్చార్జులు సిహెచ్. బాల సైదులు,రవీందర్,అధ్యాపకులు లక్ష్మీనారాయణ,రాజు,జక్కుల రమేష్,రాజేష్ ,కనకాంబర కుమార్, నాగేశ్వరరావు,ముస్తఫా,వెంకటేశ్వర్లు, సైదులు,విద్యార్ధినీ విద్యార్ధులు తదితరులు  పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

బ్యాంకుల వద్ద సామాజిక దూరం అవసరం

Satyam NEWS

మోడల్: నియంత్రిత సాగు విధానం దేశానికే ఆదర్శం

Satyam NEWS

సంతానం కలగలేదని గృహిణి ఆత్మహత్య

Bhavani

Leave a Comment