వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల
ఏపీ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరంలో మరో ఈవెంట్ ప్రారంభం కానుంది. కేంద్ర యువజన సర్వీసులు శాఖ, నెహ్రూ యువక కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచీ యువజనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. విజయనగరం గురజాడ జేఎన్టీయూ సమక్షంలో రఘు ఇంజనీరింగ్ కాలేజ్ వేదికగా ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అందుకు సంబంధించిన వాల్ పోస్టర్ ను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డిప్యూటీ మాట్లాడుతూ యువజన ఉత్సవాలు,యువతి యువకులకు, తమ విభిన్న ప్రతిభను ప్రదర్శించడానికి మరియు సమాజం మరియు సాంఘిక సంక్షేమ అంశాలపై, వివిధ సమస్యలపై వారి అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి అవకాశం మరియు మంచి వేదిక అని డిప్యూటీ స్పీకర్ కొనియాడారు.
యువజన ఉత్సవాల్లొ భాగాంగా, ప్రతిభావంతులైన యువతి, యువకులు విస్తృత శ్రేణి నిమగ్నమై ఉండేలా ఈ సంవత్సరం యువజన ఉత్సవల్లో, 6 కార్యక్రమాలు రూపకల్పన చేయబడ్డాయి
1. యంగ్ ఆర్టిస్ట్స్ శిబిరం- పెయింటింగ్
2. యువ రచయితల శిబిరం -కవిత
3. ఫోటోగ్రఫీ వర్క్షాప్
4. వక్థృత్వా ఉపన్యాసా పోటీలు
5. సంస్కృతిక ఉత్సవాలు- గ్రూప్ ఈవెంట్స్
6. యువజన సమ్మేళనం-యువ సంవాదం: భారతదేశం@2047
యువశక్తి స్ఫూర్తితో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను జరుపుకోవడానికి..ఈ యువజనోత్సవాలు దోహదపడతాయని ఎన్.వై.కే తెలిపింది.భారతదేశ స్వాతంత్ర్యం యొక్క 75వ వార్షికోత్సవం సందర్భంగా భారతదేశ స్వాతంత్ర్య పోరాటం యొక్క ఆదర్శాలు మరియు విలువలను వ్యాప్తి చేయడం, ప్రజలలో విభిన్న ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వం గురించి ప్రశంసలు కలిగించడం, నిపుణుల మార్గదర్శకత్వం కింద దేశంలోని యువ కళాకారులు, రచయితలు, ఫోటోగ్రాఫర్లు మరియు వక్తలకు ఒక వేదిక అందించడం జరుగుతుందని తెలిపారు.
యువత యొక్క శక్తి సామర్థ్యాలు జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ వేదికలపై యువ సమ్మేళనాల ద్వారా వారు కోరుకున్న సామాజిక మార్పుకు యువత, నాయకత్వం వహించాలి అని జిల్లా యువజన అధికారి జి.విక్రమాదిత్యా తెలిపారు. జిల్లాలో ఎన్.వై.కే నిర్వహించిన దేశభక్తి మరియు దేశ నిర్మాణంపై డిక్లమేషన్ పోటీలో విజేతలు కాని యువకులు మాత్రమే అర్హులని పేర్కొంది. అన్ని ఈవెంట్లకు 15-29 సంవత్సరాల వయస్సు గల యువత అఈ నెల 18వ తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎన్.వై.కే కోరింది