39.2 C
Hyderabad
April 30, 2024 22: 26 PM
Slider నిజామాబాద్

ఎందుకో తెలియదు కానీ ఇద్దరిని నరికి చంపారు

Twin Murder

కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో గల గుమస్తా కాలని వద్ద జంట హత్యలు కలకలం సృష్టించాయి. గుమస్తా కాలనిలో ఉంటున్న కొయ్యల లక్ష్మయ్య, ఆర్ఎంపీ వైద్యుడు వడ్ల సుధాకర్ దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం లింగంపేట్ మండల కేంద్రానికి చెందిన లక్ష్మయ్య ఆరోగ్యం బాగలేక నెల రోజుల నుంచి తన చెల్లెలు సుజాత వద్ద ఉంటున్నాడు.

ఇతనికి ఆరోగ్య రీత్యా ఆర్ఎంపీ వైద్యుడు సుధాకర్ మందులు ఇస్తూ పరిక్షిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఇద్దరు బాగా కలిసి పోయి ఒకే కుటుంబ సభ్యుల మాదిరిగా ఉంటారు. గురువారం రాత్రి ఇద్దరు కలిసి చుక్కపూర్ లో ఒకరికి చికిత్స నిర్వహించడానికి కలిసి వెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక చోట కూర్చుని మద్యం సేవిస్తుండగా వీరిపై దాడి జరిగినట్టు తెలుస్తుంది.

మాకు శత్రువులు ఎవరూ లేరు

లక్ష్మయ్యను విచక్షణ రహితంగా నరికి చంపగా సుధాకర్ పారిపోయే ప్రయత్నం చేస్తుండగా వెంటపడి మరీ కొట్టి చంపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు తమకు ఎవరు శత్రువులు లేరని, ఎవరో కావాలనే చంపినట్టిగా ఆర్ఎంపీ సుధాకర్ భార్య స్వప్న తెలిపింది. మొత్తం మీద జిల్లా కేంద్రానికి సమీపంలో జంట హత్యలు కలకలం రేపాయి. ఘటన స్థలానికి డిఎస్పీ లక్ష్మీనారాయణ చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

డాగ్ స్క్వార్డ్, క్లూస్ టీంతో విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. వివరాలు తెలుసుకున్నారు. మృతుడు సుధాకర్ కు భార్య స్వప్న, 5 సంవత్సరాల కొడుకు సుమిత్, 8 సంవత్సరాల పాప సంజన ఉన్నారు.

మరో మృతుడు లక్ష్మయ్యకు భార్య వెంకటమ్మ కూతురు, ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కుమారుడు స్వామి పెళ్ళై బెంగుళూరులో ఉద్యొగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు శివకుమార్ లింగంపేట్ మండల కేంద్రంలో వాటర్ మెన్ గా పని చేస్తున్నాడు. పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారని డిఎస్పీ తెలిపారు

Related posts

శ్రీ శుభకృతి కృతి

Satyam NEWS

68 నామినేషన్ల తిరస్కరణ!

Sub Editor

రేపు జరగబోయే కలెక్టర్ ముట్టడిని విజయవంతం చేయండి

Satyam NEWS

Leave a Comment