29.7 C
Hyderabad
May 2, 2024 05: 32 AM
Slider వరంగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

#road accident

జనగామ జిల్లా

రఘునాథపల్లి మండలం కోమల టోల్ గేట్ వద్ద బొలెరో వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వరంగల్ పోచమ్మ మైదాన్ ప్రాంతానికి చెందిన వడ్లకొండ రాకేష్, మరో వ్యక్తి బొలెరో వాహనంలో వరంగల్ నుండి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. మృతులిద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా తెలుస్తుంది. ఘటన స్థలానికి రఘునాథపల్లి ఎస్సై రఘుపతి చేరుకుని మృతదేహాలను జనగామ ఆసుపత్రికి తరలించారు.

రాకేష్‌తో పాటు మరణించిన మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాకేష్ హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Related posts

కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్‌

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్ తో ఎన్ పి ఆర్ నిరవధిక వాయిదా

Satyam NEWS

బీఆర్ఎస్ తెలంగాణ అధ్యక్షుడిగా ఒక దళితుడు?

Bhavani

Leave a Comment