33.7 C
Hyderabad
April 27, 2024 23: 27 PM
Slider రంగారెడ్డి

కారు, బైక్ డీకొని ఇద్దరు మృతి

#Accident

కారు, బైక్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలైన ఘటన పెద్ద శంకరంపేట్ మండల పరిధిలోని కమలాపూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజాంపేట గ్రామానికి చెందిన బాయికాడి ఆగమయ్య (58), చటుకుల తుకారాం(38) ఇద్దరు కలిసి పెద్ద శంకరంపేటకు బైక్ పై వెళ్తున్నారు.

ఈ క్రమంలోనే అతివేగంతో ఎదురుగా వచ్చిన కారు బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ ప్రయాణిస్తున్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న వ్యక్తులు భయంతో ఘటనా స్థలం నుంచి పారిపోయారు. స్థానికులు 1033 నేషనల్ హైవే అంబులెన్స్ స్థానిక పోలీసులకు సమాచారం అందజేయడంతో విషయం తెలుసుకున్న శంకరంపేట ఎస్సై బాలరాజు తన బృందంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించమని ఎస్సై బాలరాజు తెలిపారు.

Related posts

ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం

Satyam NEWS

బిజెపికి రాజీనామా చేసిన సునీల్

Satyam NEWS

బిఆర్ఎస్ పార్టీ పథకాలకు ఆకర్షితులై భారీ చేరికలు

Satyam NEWS

Leave a Comment