ఆంధ్రప్రదేశ్ లో ఆ మూల నుంచి ఈ మూల వరకూ చోరీలు చేసిన ఇద్దరిని తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 35 లక్షల విలువగల బంగారం వెండి వస్తువులతోపాటు ఓక్సా వేగన్ ,స్కోడా కార్లు,డొమినర్,పల్సర్ ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
తిరుపతి క్రైం పోలీస్ స్టేషన్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంతో ఈ వివరాలు వెల్లడించారు. తిరుపతి 4, ఒంగోలు 2, కడప 1, కొవ్వూరు 1, నెల్లూరు 1 నేరాలకు సంబంధించి సొత్తు రికవరీ చేశారు. విశాఖపట్టణం గాజువాక కు నాగ సాయి, నాగరాజు ఈ చోరీలకు పాల్పడ్డారు.
చిన్నప్పటినుండి దొంగతనాలకు అలవాటు పడి పలుసార్లు జైలుపాలయ్యారు. నాగ సాయిపై 109 కేసులు , వెస్ట్ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం కు చెందిన నాగరాజు పై 60 కేసులు ఉన్నట్లు వెల్లడించారు.
నేరస్తులకు సహకరించిన జైలు వార్డర్ శ్రావణ్ కుమార్, చీరాల కు చెందిన కానిస్టేబుల్ వెంకటేష్ పై కేసు నమోదు చేసి పై అధికారులకు ఫిర్యాదు చేశారు.