నేటి నుండి రెండు రోజుల పాటు విశాఖ నగరంలో జరుగుచున్న జి-20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా వివిద దేశాల ప్రతినిధులతో సమావేశం అయ్యేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మంగళవారం రాత్రి 7.05ని. విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు.
రాష్ట్ర మంత్రులు విడదల రజిని, బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్ నాధ్, ఆధిమూలపు సురేష్, ఆర్.కె.రోజా ,నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జే.సుభద్ర, వి.ఎం .ఆర్. చైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల, మున్సిపల్ స్పెషల్ సి ఎస్. శ్రీలక్ష్మీ, టూరిజం స్పెషల్ సి ఎస్ రజిత్ భార్గవ్, జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున, పోలీసు కమిషనర్ సి.హెచ్ శ్రీకాంత్, శాసన సభ్యులు, గొల్లబాబురావు, కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్, భాగ్యలక్ష్మీ, శెట్టి పాల్గుణ, శాసనమండలి సభ్యులు, వరుదు కళ్యాణి, నాగార్జున విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి జి.-20 సమావేశం నిర్వహించే రాడిషన్ బ్లూ నకు బయలు దేరారు.