దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం గాంధీ కుటుంబం అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 51 వ జన్మదినం పురస్కరించుకొని ఏఐసిసి మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో క్యాంపు కార్యాలయం ఆవరణలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీ కుటుంబం అని, పదవులను పక్కన పెట్టి పేద ప్రజల కోసం నిరంతరం పని చేస్తు దేశ ప్రజలకోసం పని చేస్తున్న భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అని అన్నారు.
అదేవిధంగా ఆయన ఆయురారోగ్యాలతో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మండలంలోని ములుగు, కసిందేవిపేట, దేవగిరి పట్నం,పరకాల, బండారుపల్లి, జగ్గన్న పేట, పత్తి పెల్లి, మదనపల్లి ఆటో, జిప్, టాటా మ్యాజిక్ గూడ్స్ 240 మంది డ్రైవర్లకు నిత్యావసర సరుకులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్ సహకారంతో ఎమ్మెల్యే సీతక్క అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్ తదితరులు పాల్గొన్నారు.