38.2 C
Hyderabad
April 29, 2024 12: 02 PM
Slider ముఖ్యంశాలు

ప్రజలను రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్ధికంగా ఆదుకునే బడ్జెట్

#bjpap

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు లో ప్రవేశపెట్టిన 2022-2023 వార్షిక బడ్జెట్ జనరంజకమైన బడ్జెట్ అని ఏపీ బీజేపీ కార్యవర్గ సభ్యులు బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి అన్నారు. కరోనా తర్వాత జీడీపీ 7.7 లోటుతో ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైన ప్రస్తుత పరిస్థితిలో దానిని అధిగమించడానికి 137 శాతం కేటాయించటం హర్షణీయమన్నారు. ఈ కేటాయింపులతో అన్ని రంగాలతో పాటు ఆర్థిక రంగానికి అధిక ప్రాధాన్యత కలిగిందన్నారు. రాష్ట్రాలలో ప్రజల సంక్షేమానికి కార్యక్రమాల అమలుకు ఆర్థిక సాయం అందించడానికి లక్ష కోట్లతో నిధి ఏర్పాటు హర్షణీయమన్నారు. అలాగే తయారీ రంగానికి చేయూతనిచ్చి మౌలిక సదుపాయాల కల్పన ద్వార ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ప్రత్యేకమైన సంస్థను ఏర్పాటుతో అభివృద్దికి పెద్దపీట వేసినట్టయిందన్నారు. వన్ మార్కెట్ – వన్ టాక్స్ విధానంతో వస్త్ర వ్యాపార రంగానికి ప్రోత్సాహం లభించిందని తెలిపారు… బీజేపీ నేత బవిరెడ్డి.

Related posts

Analysis: అమెరికాతో భవితవ్యం-భాగస్వామ్యం

Satyam NEWS

గుర్తు తెలియని వాహనం ఢీ: పసిపాప సహా ముగ్గురి మృతి

Satyam NEWS

కేంద్ర గెజిట్‌తో జల సంక్షోభం

Sub Editor 2

Leave a Comment