మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ డివిజన్ లోని మెట్రో రైల్వే సమీపంలో “ఆర్ సి ఆర్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్స్ ను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించి వారి మన్ననలు పొందాలని తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ ప్రీతమ్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గడ్డం రవి కుమార్, గరిక సుధాకర్ ,ఉప్పల్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్