బతుకమ్మ పండుగను పురస్కరించుకొని శనివారం నుంచి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బతుకమ్మ చీరలను గురువారం ఉప్పల్ , కాప్రా సర్కిల్ కార్యాలయంలలో పరిశీలించారు.
అధికారులు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన చీరలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు నిర్ణయించిన మేరకు ఆయా కేంద్రాల్లో మహిళలు చీరలు తీసుకోవాలని సుభాష్ రెడ్డి సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి చీరలు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఉప్పల్, కాప్ర, సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు అరుణకుమారి, శంకర్ ప్రాజెక్టు అధికారి ఇందిరా, కార్పొరేటర్లు స్వర్ణ రాజు శివమణి, జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, టి ఆర్ ఎస్ ఏఎస్ రావునగర్ డివిజన్ అధ్యక్షుడు కాసం మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుమారస్వామి రజక, మాజీ అధ్యక్షుడు భేతాళ బాలరాజు పాల్గొన్నారు.