టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ కలిశారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలోనూ అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. అనంతరం డివిజన్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సహకారం అందించాలని ప్రభుదాస్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ని కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి