38.2 C
Hyderabad
April 29, 2024 21: 39 PM
Slider విశాఖపట్నం

విజయనగరం వన్ టౌన్ స్టేషన్ ను పరిశీలించిన విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ

#DIG Harikrishna

ఎట్టకేలకు విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ… విజయనగరం వన్ స్టేషన్ ను తనిఖీ చేశారు. అనంతరం మీడియా ప్రశ్నించిన మీదట…పైనే ఉన్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ను అకస్మాత్తుగా పరిశీలించారు. ఈ సాయంత్రం అయిదున్నరకు విశాఖ నుంచి నేరుగా వన్ టౌన్ స్టేషన్ కు జిల్లా పోలీసు బాస్ దీపికా తో తనిఖీ కి వచ్చారు రాగానే స్టేషన్ సీఐ డా.వెంకటరావు…గ్రీన్ ,రెడ్ కార్పొరేట్ వేయించి… డీఐజీ, ఎస్పీలను ఆహ్వానించారు.

పెండింగ్ కేసులు… సిబ్బంది పనితీరు… వంటి అంశాలపై సీఐను అడిగారు. అనంతపురం మీడియా తో మాట్లాడుతూ …సీసీఎస్ త్వరలోనే పునరిద్ధిస్తున్నట్లు చెప్పారు. గంజాయి, డ్రగ్స్ నేరాలపై స్టేషన్ సిబ్బంది కి తగు సూచనలు ఇచ్చామన్నారు. సీసీఎస్ అంశంలో వన్ టౌన్ సీఐకి మెమో ఇచ్చిన అంశాన్ని మీడియా ప్రతినిధి ప్రస్తావించడంతో అలాంటిది ఏదీ జరగలేదని… వివరణ ఇచ్చారు. అనంతరం పైన ఉన్న సీసీఎస్ ను నిశితంగా పరిశీలించారు.

డీఎస్పీ ఛాంబర్, అలాగే ఇన్ స్పెక్టర్లు గదిని దగ్గరుండి ఎస్పీ ని దగ్గర పెట్టుకుని పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఇంచార్జి డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్ఐ లు భాస్కరరావు ,రామ్ గణేష్, వాసుదేవ్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే కేసీఆర్ లక్ష్యం

Satyam NEWS

టీడీపీ బలపర్చిన  డా.చిరంజీవిరావును గెలిపిద్దాం..!

Satyam NEWS

రామోజీరావు ఏం చేయబోతున్నారో?

Satyam NEWS

Leave a Comment