గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఊరికి ఒక జమ్మి చెట్టు, గుడికి ఒక జమ్మి చెట్టు, బడికి ఒక జమ్మి చెట్టు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేస్ సుభాష్ రెడ్డి పాల్గొని చిల్కానగర్ రాఘవేంద్ర నగర్ లోని గణపతి ఆలయంలో, సెంటు గాబ్రియల్ హైస్కూల్లో జమ్మి చెట్లు నాటారు.
ఈ కార్యక్రమం చిల్కనగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జమ్మి చెట్టు విజయానికి సంకేతమని…విజయదశమి రోజున జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే అంత మంచే జరుగుతుందని తెలిపారు.
కార్పొరేటర్ మాట్లాడుతూ ఈరోజు నుంచి దసరా వరకు ప్రతి గుడిలో, బడిలో జమ్మి చెట్టును నాటుతామనీ తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నినాదాన్ని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తీసుకున్నదుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు జనుంపల్లి వేంకటేశ్వర రెడ్డి,బద్దం భాస్కర్ రెడ్డి, గరిక సుధాకర్ , మేకల ముత్యం రెడ్డి మేకల మధుసూదన్ రెడ్డి చిలకనగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పల్లె నర్సింగ్ రావు, తెరాస నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, , vb నర్సింహ, పిట్టల నరేష్, గుడి మధుసూధన్ రెడ్డి,కోకోండ జగన్, సుభద్రా, కొండల్ రెడ్డి, మాస శేఖర్, ఈరెళ్లి రవీందర్ రెడ్డి, రామ్ రెడ్డి, మహేందర్, చేర్యాల శ్రీను, భింగి శ్రీను, రామాంజనేయులు, m రాంచందర్, రాజు యాదవ్, కొంపెల్లి రాజు, శ్రీకాంత్, శ్యామ్, బాలు, సత్యనారాయణ రెడ్డి, పరమెష్, తదితరులు పాల్గొన్నారు.