భారత్ లో పెరిగిపోతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు అమెరికా తన వంతు సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది.
రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులతో దేశ ఆరోగ్య రంగం ఇప్పటికే కుదేలైపోయింది. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేక ఆక్సిజన్ కొరతతో దేశం మొత్తం అల్లాడుతున్న విషయం తెలిసిందే.
ఈ పరిస్థితుల్లో తమ వంతు సాయం అందించేందుకు అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ భారత్ లోని సంస్థలకు సలహాలు ఇస్తున్నదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్య సలహాదారుడు డాక్టర్ ఆంథోనీ ఫ్యూసీ తెలిపారు.
భారత్ లో కనిపిస్తున్న కరోనా వేరియంట్స్ పై విశ్లేషణలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం కరోనా వేరియంట్స్ ను అదుపు చేసేందుకు ఎంత వరకు ఉపకరిస్తుందో కూడా విశ్లేషణలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు.