సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ ప్రమాణస్వీకారం రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే పదవీకాలం నేటితో ముగియనున్నది. రేపు ఉదయం 48వ సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొద్దిమంది అతిథుల సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్నది.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేబినెట్ మంత్రులు, న్యాయమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, జస్టిస్ ఎన్.వి.రమణ కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉన్నది.