తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుంటున్నారని,తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ ఋణం తీర్చుకునేందుకు నవంబర్ 30వ,తేదీ కోసం ప్రజానీకం ఎదురు చేస్తున్నారని, ప్రజలు కలలుగన్న నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని లక్షలాది మంది నిరుద్యోగులు ఆశలతో తమ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని ఎదురుచూస్తున్నారని ఎన్ ఎస్ యు ఐ పట్టణ అధ్యక్షుడు అన్నారు. హుజూర్ నగర్ ప్రజా నాయకుడు అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాలకు ఆషాకిరణం కెప్టెన్ నలమాద ఉత్తంకుమార్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించుకొని ప్రజా తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటుకు యువత కృషి చేయాలని షేక్ ముస్తఫా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నిరుద్యోగ సమస్యలను కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తుందని,కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో యువతకు అండగా వుంటుందని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎన్ ఎస్ యు ఐ ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నదని తెలియజేశారు.రైతులకు ఏక కాలంలో 2 లక్షల రూపాయలు ఋణమాఫీ, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కాంగ్రెస్ ప్రభుత్వం అందించబోతుందని,కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని,ప్రతి సంక్షేమాన్ని ప్రతి గడప గడపకు అందించడమే ఎన్ ఎస్ యు ఐ ప్రధమ కర్తవ్యమని షేక్ ముస్తఫా అన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్