ములుగు జిల్లాలో వారంలో రెండు రోజులు పోవే టీకాల కార్యక్రమం నిలిపివేస్తున్నట్టు ములుగు డీఎం & హెఓ డాక్టర్ అప్పయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, ఇకపై ప్రతి ఆదివారం, బుధవారం జిల్లాలో కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం నిర్వహించడం లేదని తెలిపారు.
మిగతా రోజుల్లో సోమవారం, మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం టీకాల కార్యక్రమం కొనసాగుతుందని డి ఏం & హెచ్ ఆర్ తెలిపారు.
సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది.
పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఇచ్చే రొటీన్ ఇమ్యునైజేషన్ ప్రతి బుధవారం, శనివారాల్లో టీకాల కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్యాంసుందర్ తెలిపారు.