35.2 C
Hyderabad
April 27, 2024 13: 57 PM
Slider కృష్ణ

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన వాజపేయి

#bjpvijayawada

మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా విజయవాడలోని సత్యనారాయణ పురం శివాజి కేఫ్ సెంటర్ లో సుపరిపాలన దినం గా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీనివాసరాజు మాట్లాడుతూ ప్రధానిగా వాజపేయి ని స్మరించుకోవడం ముదావహం అని చెప్పారు. స్వర్ణ చతుర్భుజి, ప్రధాన మంత్రి అవస్ యోజన, ప్రధాన మంత్రి సడక్ యోజన, వంటి అనేక పథకాలతో దేశాన్ని అభివృధి పదం లోకి తెచ్చారని, ఇప్పుడు ప్రధాని మోడీ అయన ఆశయాయలను, పథకాలను మరింత వేగవంతం చేసి దేశాన్ని ప్రపంచంలో మేటిగా నిలిపారని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భాజపా యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్ వాజపేయి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఇంకా యువజన నాయకుడు నాగలింగం శివాజి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తంగిరాల రాఘవ శాస్త్రి, సత్యనారాయణ పురం భాజపా అధ్యక్షుడు బాచిమంచి రవి కుమార్, జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ బోగ్గరపు సత్యనారాయణ , OBC సెల్ అధ్యక్షుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీఎం కేసీఆర్ పై 100 నామినేషన్లు వేస్తున్న పౌల్ట్రీ రైతులు

Satyam NEWS

ఘనంగా “దేవరకొండలో విజయ్ ప్రేమ కథ” ప్రీ రిలీజ్ కార్యక్రమం

Satyam NEWS

కమలం కింద మంట: మళ్లీ రేగుతున్న పెగాసస్ సెగ

Satyam NEWS

Leave a Comment