వాల్మీకి మహర్షి సఫాయి కర్మ చారి కార్మిక సి ఐ టి యు సి అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం నిర్వహించిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకలలో పాల్గొన్న సి ఐ టి యు సి జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి మాట్లాడుతూ కుటుంబ పోషణార్థం దొంగగా మారిన వాల్మీకి నిజాన్ని తెలుసుకొని నిరంతర రామ నామ జపంతో శ్రీరామాయణాన్ని రచించి లోక ప్రసిద్ధి గాంచిన మహర్షి అయ్యాడని అన్నారు.
నాడు శ్రీవాల్మీకి రచించిన శ్రీమద్రామాయణం పవిత్ర గ్రంథంగా భావించి పూజిస్తున్నాం అని అన్నారు. హుజూర్ నగర్ పట్టణ సఫాయి కర్మచారుల సంఘం ప్రధాన కార్యదర్శి రాకేష్ మాట్లాడుతూ తమ కులదైవమైన శ్రీవాల్మీకి మహర్షి జయంతి ఉత్సవ వేడుకలను రాబోయే రోజులలో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు.
ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలోని రోగులను పరామర్శించి వారికి బ్రెడ్డు పాకెట్లు,పళ్ళు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ యలక సోమయ్య గౌడ్, సఫాయి కర్మచారి సంఘం అధ్యక్షుడు మహిపాల్, ఉపాధ్యక్షుడు పి.రాజు, ఆకాష్, జితేందర్, లక్ష్మణ్, సునీల్, శ్యామ్, మీనా, చాందిని, రజిత, లక్ష్మీ, సంగీత, సోనీ, మమతా తదితరులు పాల్గొన్నారు.