మహిళలపై నోటికొచ్చినట్లు మాట్లాడే దృష్ట సంస్కృతికి తెరలేపిందే మంత్రి రోజానే అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా తన గురించి రోజా అసభ్యంగా మాట్లాడారని ఆమె తెలిపారు. అదే విధంగా తెలుగుదేశం నాయకురాలు పీతల సుజాతను బాడీ షేమింగ్ చేసింది రోజా కాదా? అని అనిత ప్రశ్నించారు. ఆ రోజు ఆడతనం, మహిళ అన్న అంశాలు రోజాకు గుర్తుకు రాలేదా? ఇవాళ రోజా నీతులు మాట్లాడుతుంటే ఏమనుకోవాలి? టీడీపీ మహిళా నేతలపై అసభ్యంగా మాట్లాడితే వారిపై కేసులు ఉండవా? మా ఫిర్యాదులపై ఇప్పటివరకు విచారణ జరగలేదు అని అనిత తెలిపారు.
previous post