ఎలాంటి ఆసరా లేని వారికి పెన్షన్లు అందచేయాలని కృష్ణా జిల్లా నందిగామ ఆర్యవైశ్య సంఘం నిర్ణయించింది.
ఈ మేరకు వారు వృద్ధులకు పెన్షన్లను పంచిపెట్టారు. నందిగామ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో సంఘం నాయకులు పారేపల్లి సాయిబాబు నేతృత్వంలో చందర్లపాడు వాస్తవ్యులు కీ॥శే చక్కా రామకృష్ణ వారి కుమారులు చక్కా సాయికృష్ణ, చక్కా పవన్ కుమార్ ఈ ఉచిత పెన్షన్లు పంపిణీ చేశారు.
నేడు మొత్తం 11 నిరుపేద ఆర్య వైశ్య కుటుంబాల వారికి వాసవీ వృద్యాప్య పెన్షన్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నాయకులు చల్లా వెంకటనర్సయ్య, రాచూరి శీతారాములు, పులిపాటి శ్రీనివాస్, చవట నాగేశ్వరరావు, పెనుగొండ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.