ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుటుంబానికి రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బాసటగా నిలిచారు. కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా రూ. 2 ఆర్థిక సాయం అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం ఈర్లపుడికి మంత్రులతో కలిసి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా రవిచంద్ర చేరుకున్నారు. ఈర్లపుడిలోని శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. ప్రభుత్వం నుంచి అందించే సాయంతో పాటు వ్యక్తిగతంగా తాను కూడా బాధిత కుటుంబానికి అండగా నిలవాలని ఎంపీ బావించారు. దీంతో రూ. 2 లక్షల రూపాయలను మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి ల చేతుల మీదుగా మృతుని కుటుంబ సభ్యులకు ఇప్పించారు. ప్రభుత్వ సాయానికి తోడు వ్యక్తిగతంగా ఆదుకున్న ఎంపీ రవిచంద్ర ను మంత్రులు అభినందించారు.
previous post