కన్సల్టింగ్ సంస్థ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు మర్చంట్ నేవీ షాహుకారి నాగేశ్వరరావుకు సూచించారు. ఇటీవల రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన ప్రసాదరావును సోమవారం ఆర్ ఆర్ షిప్పింగ్ కన్సల్టింగ్ డైరక్టర్ , మర్చంట్ నేవీ , సొండి కుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి షాహుకారి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసారు.
ధర్మానకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ, షాపుకారు నాగేశ్వరరావు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల పట్ల అభినందనలు తెలిపారు. ఇదే పంథాను కొనసాగిస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా, వారి నైపుణ్యాభివృద్ధికి తగిన చర్యలు తీసుకుని ఉద్యోగవకాశాలు కల్పించాలని సూచించారు.
ఇందుకు తనవంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు. పదిమందికి సాయమందించే గుణం కలిగి ఉండడం నాగేశ్వరరావు గొప్పతనమని, సేవా తత్పరతను కొనసాగించాలని చెప్పారు. ధర్మానను కలసిన వారిలో మైలపల్లి యర్రయ్యదాసు, అంబటి తిరుపతి, అర్థాల మన్మధరావు, కొమర రాంబాబు తదితరులు ఉన్నారు.