మాస్కులు ధరించండి. భౌతిక దూరం పాటించండి. శానిటైజర్ లు వాడండి. సమావేశాలకు దూరంగా ఉండండి అని… వెంకటగిరి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వరరావు అన్నారు.
వెంకటగిరి పట్టణం, త్రిభువని కూడలిలో మంగళవారం నాడు సాయంత్రం కరోనా ను నియంత్రించే క్రమంలో భాగంగా… స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు… గత కొద్ది రోజులుగా వెంకటగిరి పోలీస్ సర్కిల్ క్రింద ఉన్న వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, రాపూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి రోజు సాయంత్రం 4.30 గంటల నుండి 6.30 వరకు కరోనా నియంత్రణలో భాగంగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సెకండ్ వేవ్ లో గత 15 రోజులుగా… రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా… ప్రతి ఒక్కరూ కరోనా నియమ నిబంధనలు విధిగా పాటించాలని..లేకపోతే చట్టరీత్యా కేసులు నమోదు చేసి, జరిమానా విధిస్తామని సీఐ తెలిపారు.
మంగళవారం నాడు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మాస్కులు ధరించని వాహనదారులకు కేసులు నమోదు చేసి భారీగా జరిమానాలు విధించారు.
కె.రమాకాంత్