వైఎస్ఆర్.టి.పి వనపర్తి నియోజకవర్గ అసెంబ్లీ కో- ఆర్డినేటర్ గా వనపర్తికి చెందిన న్యాయవాది బూజల వెంకటేశ్వర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వెంకటేశ్వర్ రెడ్డికి వైఎస్ షర్మిల పదవి బాధ్యతలు అప్పగించారు. వైఎస్ ఆర్.టి.పి పార్టీ అధినేత్రి షర్మిల సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఆయన పార్టీకి మరింత సేవలు అందించాలనే సదుద్దేశ్యంతో షర్మిల నిర్ణయం తీసుకున్నారు. వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆమె సూచించినట్లు వెల్లడించారు. తనపై నమ్మకం ఉంచి పదవి బాధ్యతలు అప్పగించిన వైఎస్ఆర్.టి.పి పార్టీ అధినేత్రి షర్మిలకు బూజల ధన్యవాదాలు తెలిపారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్