హైదరాబాద్ లోని ఖైరతాబాద్ జంక్షన్ లో రూ. 68 లక్షలతో అభివృద్ధి చేసిన పెడెస్ట్రియల్ ప్రాజెక్ట్, వెర్టికల్ గార్డెన్, ఎల్ ఈ డీ లైట్లను ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ ప్రారంభించారు. హైదరాబాద్ నగరాన్ని పర్యావరణహితంగా, పాదచారుల ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.
రద్దీగా వుండే ఈ ప్రాంతంలో ప్రయాణించే వారి సౌకర్యార్థం రూ 40 లక్షలతో ఫుట్ పాత్ సుందరీకరణ, ఫౌంటెన్లు, ఎల్ ఈ డీ సెంట్రల్ లైటింగ్, మార్కింగ్, డివైడర్లు ఏర్పాటు చేశారు. అలాగే 265 మీటర్లు పొడవున ఖైరతాబాద్ బ్రిడ్జి కి వెర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేశారు. 45 రోజులలో పెడెస్ట్రియల్ ప్రాజెక్టును పూర్తిచేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పాదచారుల భద్రతకై అన్ని జాగ్రత్తలతో ఈ ప్రాజెక్ట్ను రూపొందించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (ట్రాఫిక్) అనిల్ కుమార్, జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ, డిప్యూటి కమిషనర్ గీతారాధిక, ఇఇ నర్సింగరావు, యు.సి.డి డిడి శ్రీనివాస్, ఎలక్ట్రికల్ ఇఇ గణేష్ తదితరులు పాల్గొన్నారు.