వెంకటగిరి మున్సిపాలిటీ 3వ చైర్ పర్సన్ గా నియమితులైన నక్కా భానుప్రియ ను వెంకటగిరి ఫ్రెండ్స్ సోషల్ సర్వీస్ సొసైటీ (VFSSS) సన్మానించింది.
విద్యాధికురాలు అయిన నక్కా భానుప్రియ వెంకటగిరి పట్టణ ప్రథమ పౌరురాలు కావడం సంతోషం కలిగిస్తున్నదని ఈ సందర్భంగా VFSSS ప్రతినిధులు అన్నారు.
చైర్ పర్సన్ భాను ప్రియతో బాటు ఆమె భర్త ఆంధ్ర ప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు ను కూడా “వెంకటగిరి ఫ్రెండ్స్ సోషల్ సర్వీస్ సొసైటీ” సభ్యులు పూల మాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు డాక్టర్ కె. రవీంద్రబాబు, కార్యదర్శి పి. వెంకటేశ్వర్లు, కోశాధికారి నందకిషోర్, సభ్యులు డాక్టర్ రామాంజనేయులు, సాయి తేజ స్కూల్ కరస్పాండెంట్ నారాయణ రెడ్డి, హెచ్ పి పెట్రోల్ బంక్ అధినేత శ్రీనివాసరావు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేష్, జమీన్ రైతు విలేఖరి చెంచు కృష్ణయ్య తదితర సభ్యులు పాల్గొన్నారు.
వెంకటగిరి సామాన్యుడు