కడప జిల్లా రాజంపేటలోని పలు కిరాణా షాపులలో తూనికలు కొలతలు విభాగం విజిలెన్స్ అధికారులు శుక్రవారం నాడు పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు ఈ దుకాణందారులు అమ్మినట్లు తనిఖిలలో వెల్లడైంది.
కొన్ని వస్తువులు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ కు కూడా అమ్ముతున్నారు. దాంతో నాలుగు కిరాణా షాపుల మీద కేసులు నమోదు చేశారు. ఈ దాడులలో తూనికలు కొలతలు ఇన్స్పెక్టర్ ఎం.దివ్య, విజిలెన్స్ ఇన్స్ఫక్టర్ పురుషోత్తం, రాజు వారి సిబ్బంది పాల్గొన్నారు.