40.2 C
Hyderabad
April 29, 2024 15: 49 PM
Slider విజయనగరం

పోలీసు కుటుంబాలను ఆదుకుంటున్న భద్రత చెక్ ను ఇచ్చిన ఎస్పీ

#VijayanagaramSP

పోలీసు కుటుంబాలకు..శాఖా పరంగా అందిస్తున్న పథకాలు..ఆయా కుటుంబాలకు ఎంతో ఉపయోగపడతాయని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ అన్నారు.

జిల్లా పోలీసుశాఖలో పని చేస్తూ విధి నిర్వహణలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తెర్లాం ఎ. ఎస్. ఐ డి.వి.కృష్ణారావు కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన భద్రత మరియు కార్పస్ ఫండ్ చెక్ లను జిల్లా పోలీసు కార్యాలయంలో  పార్వతి, భర్త డి.వి.కృష్ణారావు, ఎ.ఎస్.ఐ, తెర్లాం పి.ఎస్ కు 4 లక్షల భద్రత చెక్ ను మరియు లక్ష కార్పస్ ఫండ్ చెక్ ను జిల్లా ఎస్పీ అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  రాజకుమారి మాట్లాడుతూ – విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని రాయితీలను సకాలంలో అందే విధంగా చర్యలు చేపడతామన్నారు.

ఈ కార్యక్రమంలో డీపీఓ సూపరిండెంట్ లు ప్రభాకరరావు, కామేశ్వరరావు, పోలీసు అధికారుల సంఘం అడహాక్ సభ్యులు కె.శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

కడప చెన్నై రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Satyam NEWS

తెలంగాణపై వివక్ష: పార్లమెంటులో పోరాటానికి కేసీఆర్ ఆదేశం

Satyam NEWS

హిందూ దేవాలయ అభివ్రుద్ది కమిటి లో ముస్లిం

Bhavani

Leave a Comment