విజయనగరం జిల్లా పోలీస్ బాస్ మరోసారి జిల్లాలో అత్యంత కీలకమైన వన్ టౌన్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషనులో కానిస్టేబులుగా పని చేస్తున్న సనపల అజయ్ కుమార్ సన్మానించారు. ఇటీవల ఎస్ ఎల్ పీఆర్బీ విడుదల చేసిన ఎస్ఐ నియామకాల్లో సివిల్ ఎస్ఐ గా జోన్ 1 ఓపెన్ కేటగిరీలో ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక సిబ్బందికి మార్గదర్శనం చేశారు. పోలీసుశాఖలో సివిల్ ఎస్ఐగా ఎంపికైన వన్ టౌన్ పోలీసు స్టేషను కానిస్టేబులు సనపల అజయ్ కష్టపడి మంచి ఫలితం సాధించారని అన్నారు.
సాధించిన ఫలితంతో సంతృప్తి చెందకుండా మరింత ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా ప్రయత్నం సాగించాలన్నారు. అనంతరం, అజయ్ ను జిల్లా ఎస్పీ ఎం.దీపిక అభినందించి, శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. డీఎస్పీ ఆర్.గోవిందరావు, వన్ టౌన్ సిఐ డా బి వెంకటరావు, సిసిఎస్ సిఐ సత్యనారాయణ మరియు ఎస్ఐలు, సిబ్బంది అభినందించి, పుష్ప గుచ్చం అందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఆర్.గోవిందరావు,, సిసిఎస్ సిఐ సత్యనారాయణ, ఎస్ఐ లు భాస్కరరావు, అశోక్ కుమార్, నరేష్, తారకేశ్వర రావు, రామ గణేష్, గోపాల్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.