25.2 C
Hyderabad
May 8, 2024 10: 33 AM
Slider విజయనగరం

సీఎం జగన్ నిరుద్యోగుల ద్రోహి.. జాబ్ క్యాలెండర్ కోసం అంబేద్కర్ కు వినతిపత్రం..!

#protest

విజయనగరం లో బాలాజీ జంక్షన్  అంబేద్కర్ విగ్రహం వద్ద టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ ఉపాధ్యక్షులు బేవర భరత్ ఆధ్వర్యంలో సీఎం జగన్ నిరుద్యోగుల ద్రోహి అంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ విజయనగరం పార్లమెంట్ అధ్యక్షప్రధాన కార్యదర్శులు పతివాడ తారక రామానాయుడు, తెలుగుయువత పార్లమెంట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేమలి చైతన్య బాబు, గొలగాన సురేంద్ర, రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి చీమల సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులు రామ్మూర్తి, తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోగిరి పైడిరాజు, తెలుగుయువత , టీఎన్ఎస్ఎఫ్ నాయకులు గంటా రవి, చిప్పాడ స్వామి, రాజీ నాయుడు, మహేష్, పీకేఎల్ రాజు, శ్రీను, తదితరులు  పెద్ద ఎత్తున నిరుద్యోగులు  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ నేతలు మాట్లాడుతూ రాష్ట్రం లో యువత పరిస్ఠితి దారుణంగా ఉందని ఈ సీఎం జగన్ కారణంగా విద్యార్థులు, యువత భవిష్యత్ అంధకారంలో ఉందని అన్నారు. కొత్త పరిశ్రమలు తీసుకొని రాకపోగా ఉన్న పరిశ్రమలు తరిమారని ఆవేదన  వ్యక్తం చేశారు.టీడీపీ జాతీయ అధ్యక్షుడు బాబు ఇచ్చిన   నిరుద్యోగ భృతి ప్రతీ నెలా 2000 తీసేసి కనీస అసరా లేకుండా చేశారన్నారు. పాదయాత్రలో భాగంగా ప్రతీ ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారని, 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా మూడేళ్లలో కేవలం 10వేల 143 ఉద్యోగాలకు మాత్రమే జాబ్ క్యాలెండర్ ఇచ్చి, కనీసం అవి కూడా భర్తీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని లేకపోతే తెలుగు యువత ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని అన్నారు.

Related posts

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

Satyam NEWS

కరోనాను ఎదుర్కొవడానికి అన్ని చర్యలు తీసుకున్నాం

Satyam NEWS

వాలెంటైన్ డే ను విడిచి అమరులను స్మరించుకుందాం

Satyam NEWS

Leave a Comment