29.7 C
Hyderabad
May 1, 2024 10: 24 AM
Slider విజయనగరం

విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ నోటి వెంట హిందువు ని..అన్న పదం.

మనది హిందూ దేశం..హిందువుగా పుట్టాము.హిందువుగానే మరణిద్దాం..ఇలా ప్రతీ ఒక్క భారతీయుడు అనుకోవాలి. అయితే గడచిన రెండు దశాబ్దాల నుంచీ ఈ హిందూ ,హిందువులు అన్న పదం సర్వత్రా వినిపించడం.. చర్చలు జరగడం.. ఆ పై మరింత గా నేను హిందువుని అని స్పష్టం చేస్తున్నారు.

అయితే గడచింది చెబుతూ..ఆ సోది ఎందుకు చెబుతున్నానని అనుకోవద్దు.. ఏపీలో ని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు.. నోటి వెంట.. నేను హిందువుని అన్న పదం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే.. రాష్ట్రంలో ని విజయనగరం జిల్లాలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన జరిగింది. ఆ పర్యటన లో జగన్ ప్రభుత్వాన్ని..జిల్లా కు ఏదీ చేయలేదని ధ్వజమెత్తారు.

సీన్ కట్ చేస్తే.దాన్ని ఖండిస్తూ జిల్లా కు చెందిన.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో పాటు జేడ్పీ చైర్మన్ మీడియా సమావేశం పెట్టి మరీ వాస్తవాలు జిల్లా ప్రజలకు చెప్పారు. ఆ సందర్భంలో మనం హిందువులం కాబట్టి మనకు కొన్ని కట్టు బాట్లు ,సంప్రదాయాలు ఉంటాయి కాబట్టీ అంటూ మూడేళ్ళ పాలన గురించి.. అలాగే 40 ఏళ్ల బాబు రాజకీయం గురించి.. చైర్మన్ మాట్లాడటం విశేషం..చెప్పుకోదగ్గ పరిణామం అని అంటోంది సత్యం న్యూస్. నెట్.

Related posts

అఫ్గానిస్తాన్‌ తాలిబన్ల చీఫ్‌ హైబతుల్లా అఖుంద్‌జాదా

Sub Editor

తిరుమలలో క్రమంగా పెరుగుతున్న భక్తుల రద్దీ

Satyam NEWS

వివాదస్పద కొటియా గ్రామస్థులకు అండగా ఉంటాం

Satyam NEWS

Leave a Comment