కరోనా సెకండ్ వేవ్ తెగ విజృంభిస్తున్న వేళ దేశం అంతటా అల్లకల్లోలం అవుతోంది. ప్రతీ రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకివాలని కేంద్ర ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. ఈ మేరకు ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ కూడా అమలవుతోంది.
ఈ నేఫధ్యంలో ఉత్తరాంధ్ర లోని విజయనగరం జిల్లాలో కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేస్తోంది.. జిల్లా యంత్రాంగం. రాత్రి పధి తర్వాత కర్ఫ్యూ ప్రారంభమై..ఉదయం అయిదువరకూ అమలవుతోంది.ఈ సందర్భంగా నగరంలో కర్ఫ్యూ అమలవుతున్న పరిస్థితి ని సత్యం న్యూస్. నెట్.ప్రతినిధి ఫోటోలతో చూపించే యత్నం చేసారు.
జిల్లా వ్యాప్తంగా 600 కేసులు రావడంతో జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు కర్ఫ్యూ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ,బాలాజీ జంక్షన్, గంటస్థంభం ప్లదేశేలాలలి ఏఆర్ ఇన్ స్పెక్టర్ ఈశ్వరరావు, వన్ టౌన్ ఎస్ఐ కిరణ్, ఏఎస్ఐ సూర్యనారాయణ గస్తీ తిరిగి పరిస్థితి పర్యవేక్షించారు.