టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తాగుబోతు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారు. అయ్యన్న పాత్రుడు భూమికి భారంగా మారాడని, తెల్లవారి లేస్తే ఏం పని లేక విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాడని ఆయన అన్నారు. అయ్యన్న పాత్రడు వల్ల ఈ ప్రాంతానికి గాని రాష్ట్రానికి గాని ఎలాంటి ఉపయోగం లేదన్నారు.
ఆయన కుమారులు నిరుద్యోగులు గానే ఉన్నారని.. వస్తే వారికి కూడా ఉపాధి కల్పిస్తామని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాలపై, రాష్ట్రానికి ఎవరు ప్రయోజనం చేకూర్చే వారితోనే తాము వెళ్తామని.. అది ఎప్పుడో తీసుకున్న నిర్ణయం అలాగే ముందుకు వెళ్తామని ఎంపీ స్పష్టం చేశారు.
ఆ నిర్ణయంపై ఎలాంటి మార్పు ఉండదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు నుంచి ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. పబ్లిక్, ప్రైవేట్ రంగంలో కలిపి ఉపాధి కల్పించామని తెలిపారు. నైతిక విలువలు పడిపోతున్నాయని రోజుల్లో.. నైతిక విలువలు విద్యార్థులు పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు.